Wednesday, March 27, 2024

తెలంగాణలో 500కి దిగువన కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 79,231 మంది నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 449 కరోనా కేసులు నమోదయ్యాయి. 623 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి కాగా.. వైరస్‌ ప్రభావంతో ఇద్దరు మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 8,406 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఆదివారం మొత్తం 79,231 మందికి కొవిడ్‌ పరీక్షలు చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ వివరించింది. ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 6,49,406కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 3,825కి పెరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement