Monday, April 15, 2024

దేశ స‌మ‌స్య‌ల నుంచి ప్ర‌జ‌ల దృష్టిని మార్చే కుట్ర జ‌రుగుతోంది-మంత్రి కేటీఆర్

ఇది మోడీ ప్ర‌భుత్వం కాద‌ని ..అటెన్ష‌న్ డైవ‌ర్ష‌న్ ప్ర‌భుత్వ‌మ‌ని అన్నారు మంత్రి కేటీఆర్. దేశ సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చే కుట్ర జరుగుతోందన్నారు. మండిపోతున్న పెట్రో ధరల నుంచి ప్రజల దృష్టి మరల్చే కుట్రేనని కేటీఆర్‌ ఆరోపించారు. భారమవుతున్న నిత్యవసరాల నుంచి ప్రజల దృష్టి మరల్చే కుట్ర అని, ఊడిపోతున్న ఉద్యోగాల నుంచి ప్రజల దృష్టి మరల్చే కుట్ర అన్నారు. ఈ కుట్రను కనిపెట్టకపోతే.. దేశానికే, భవిష్యత్ తరాలకు కోలుకోలేని నష్టమన్నారు. దేశం కోసం.. ధర్మం కోసం.. అనేది బీజేపీ అందమైన నినాదమని, విద్వేషం కోసం.. అధర్మం కోసం.. అనేది అసలు రాజకీయ విధానమని ఆరోపించారు. హర్‌ ఘర్‌ జల్‌ అన్నారు కానీ.. హర్‌ ఘర్‌ జహర్‌ (విషం) అనీ.. ప్రతి మనసులో విషయాన్ని నింపే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. పచ్చగా ఉన్న తెలంగాణాలో చిచ్చు పెట్టె చిల్లర ప్రయత్నం జరుగుతోందని, విష ప్రచారాలతో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement