Thursday, April 18, 2024

ఆసుపత్రి నుంచి విహెచ్ డిశ్చార్జ్

అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు 24 రోజుల తర్వాత నిన్న డిశ్చార్జ్ అయ్యారు.తాను త్వరగా కోలుకోవాలని, తన ఆరోగ్యం కుదుటపడాలని కోరుతూ పూజలు చేసిన అభిమానులు, నాయకులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు వీహెచ్.

కాగా, అనారోగ్యం కారణంగా వీహెచ్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందిన సంగతి తెలిసిందే. పలువురు కాంగ్రెస్ నేతలు ఆయనను ఆస్పత్రిలో పరామర్శించారు. సోనియా గాంధీ సైతం వీహెచ్ ఆరోగ్యంపై ఆరా తీశారు. టీపీసీసీ‌ అధ్యక్షుడిగా నియామకమైన తర్వాత రేవంత్‌రెడ్డి ఇటీవల ఆసుపత్రిలో వీహెచ్‌ను కలిసి పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement