Friday, April 19, 2024

ప్ర‌జా చైత‌న్య యాత్ర‌లో… నేడు, రేపు కాంగ్రెస్ నిర‌స‌న‌లు

టీపీసీసీ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్రలలో భాగంగా నేడు మండలాల్లో, రేపు జిల్లా కేంద్రాల్లో వ్యవసాయం, రైతు సమస్యలపై కాంగ్రెస్ నాయకులు నిరసన ప్రదర్శనలు నిర్వ‌హించి, వినతి పత్రాలు సమర్పించ‌నున్నారు. ధాన్యం కొనుగోలు, రైతులకు పంట నష్టాలు, మరణించిన రైతులకు పరిహారం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై కాంగ్రెస్ నిరసన ప్రదర్శనలు చేయ‌నుంది. మండలాల్లో తహశీల్దార్ కు, జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ లకు వినతిపత్రాలు కాంగ్రెస్ నాయ‌కులు అంద‌జేయ‌నున్నారు. రెండు రోజుల కార్యక్రమాలకు టీపీసీసీ ఇన్‌ ఛార్జీలను ప్రకంటించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement