Friday, March 29, 2024

తెలంగాణలో సోనియమ్మ రాజ్యం తీసుకొస్తాం: రేవంత్

తెలంగాణలో సోనియమ్మ రాజ్యాన్ని తీసుకొస్తామని టీ.పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో దివంగత కాంగ్రెస్ నేత  జైపాల్ రెడ్డి పాత్ర కీలకమైందని చెప్పారు. మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా నెక్లెస్ రోడ్ లోని ఆయన సమాధి వద్ద కాంగ్రెస్ నేతలు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో జైపాల్ రెడ్డి పాత్ర కీలకమైందన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం సర్వే చేయించి పాలమూరు సస్యశ్యామలం కావడానికి పునాదులు వేశారని గుర్తు చేశారు. హైదరాబాద్ లో మెట్రోరైలు రావడానికి కారణం జైపాల్ రెద్దు కృషినేని కొనియాడారు. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రిగా, పట్టణాభివృద్ధి మంత్రిగా ఆయన చేసిన సేవలు మారువలేనివని చెప్పారు. రాజకీయాలలో మచ్చలేని మనిషి అని, ఎన్నో కీలకమైన పదవులు నిర్వహించినా అవినీతి మరక అంటని గొప్ప నాయకుడని చెప్పారు. సోనియూ గాంధీ మాటనే ఫైనల్ అని చెప్పి ఆమెను ఒప్పించి తెలంగాణ సాధన అయ్యేలా చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు.  జైపాల్ రెడ్డి ఆశయాలు, సిద్ధాంతాలు తెలంగాణలో ఆచరించి అభివృద్ధి చేయాలన్నారు. తెలంగాణ కాంగ్రెస్ సైనికులుగా సోనియా గాంధీ నమ్మకాలను నిలబెట్టి పార్టీని అధికారంలోకి తెచ్చి సోనియమ్మ  రాజ్యం ఏర్పాటు చేస్తామని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement