Friday, March 29, 2024

బీజేపీలో చేరికపై రాజగోపాల్ రెడ్డి క్లారిటీ

తాను బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఖండించారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈ నెల 13న బీజేపీలో చేరనున్న నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి కూడా కాషాయ తీర్ధం పుచ్చుకుంటారని ప్రచారం జరిగింది. దీంతో ఆయన స్పందించారు. కొందరు పనిగట్టుకుని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను ఏ బీజేపీ నేతను కలవలేదని, అలాంటి లీకులు ఎందుకు ఇస్తున్నారో తెలియదని స్పష్టం చేశారు. రాజకీయంగా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటానని గతంలోనే చెప్పాన్న రాజగోపాల్ రెడ్డి…ఇప్పుడు రాజకీయాలు చేసే సమయం కాదన్నారు. కరోనా తో జనం ఇబ్బంది పడుతుంటే… రాజకీయాలేంటి ? అని ఆయన ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి: చంద్రగిరిలో ఆనందయ్య మందు.. ప్రజలకు ఉచితం పంపిణీ

Advertisement

తాజా వార్తలు

Advertisement