Thursday, April 18, 2024

Huzurabad: ఇది ఈటల రాజేందర్ గెలుపు.. బీజేపీది కాదన్న పొన్నం

హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితాలు అధికార టీఆర్ఎస్ పార్టీకి తీవ్ర నిరాశను కలిగిస్తోంది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ పై ఆధిక్యతను కొనసాగిస్తున్నారు. ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి వెంటక్ కి నామ మాత్రపు ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు.

హుజూరాబాద్ ఫలితాలు ఊహించిన విధంగానే వస్తున్నాయని పొన్నం అన్నారు. తనను మంత్రి పదవి నుంచి కేసీఆర్ అప్రజాస్వామిక పద్ధతిలో తొలగించారనే విషయాన్ని ఈటల రాజేందర్ చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారని చెప్పారు. హుజూరాబాద్ ఎన్నికల కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రజలు స్వాగతించలేదన్నారు. ఈటల గెలుపు బీజేపీ విజయంగా బండి చెప్పడం సరికాదన్న పొన్నం.. ఇది కేవలం ఈటల గెలుపు మాత్రమేనని స్పష్టం చేశారు. ఈటల రాజేందర్ సొంతంగా ప్రచారం చేసుకున్నారని… బీజేపీ అభ్యర్థినని ఎక్కడా చెప్పుకోలేదన్నారు. ఇది ముమ్మాటికీ ఈటల గెలుపు మాత్రమేనని… బీజేపీ గెలుపు కాదని వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement