Thursday, April 18, 2024

ఈటలకు ఓ రూల్.. మీకో రూలా?: కేసీఆర్ కు పొన్నాల ప్రశ్న

సీఎం కేసీఆర్ పై మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య విమర్శలు గుప్పించారు. అవినీతి ఆరోపణలతో ఈటల రాజేందర్ ను బయటికి పంపిన సీఎం కేసీఆర్.. ఆయన కుటుంబంపై వచ్చిన ఆరోపణలపై విచారణ ఎందుకు జరిపించరని ప్రశ్నించారు. కేసీఆర్ పై సీబీఐ, ఈడీ విచారణపై బీజేపీ ఎందుకు మౌనం వహిస్తోందని నిలదీశారు. కాకతీయ పథకం అంతా అవినీతి మయమని విమర్శించారు. అవినీతిమయమైన టీఆర్ఎస్, బీజేపీకి ఓట్లు వేయొద్దని హుజూరాబాద్ ప్రజలను సూచించారు. టీఆర్ఎస్ హయాంలో కొత్తగా వచ్చిన కంపెనీలు ఎన్నో చెప్పాలని పొన్నాల డిమాండ్ చేశారు. కాంగ్రెస్ వేసిన పునాదులపై పెరిగిన వాటిని టీఆర్ఎస్ ఖాతాలో వేసుకుంటారా? అని మండిపడ్డారు. గూగుల్, అమెజాన్ కంపెనీలు తమ హయాంలో పడ్డ పునాదులని పొన్నాల గుర్తు చేశారు.

ఇది కూడా చదవండి: కలెక్టర్ సుప్రీం కంటే సుప్రీమా?: రేవంత్ రెడ్డి

Advertisement

తాజా వార్తలు

Advertisement