Saturday, April 20, 2024

ఇద్దరూ ఇద్దరే.. రైతులతో ఆటలాడొద్దు: భట్టి

యాసంగిలో వరి వేయిద్దన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తప్పుబట్టారు. రైతులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫుట్‌బాల్‌ ఆడుతున్నాయని మండిపడ్డారు. కేంద్రం కొనదు కాబట్టి నేను కొనను అంటే ఎలా అని భట్టి ప్రశ్నించారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ ఇద్దరూ కలిసి రైతులతో ఆటలాడుతున్నారని ఆరోపించారు. రైతు పండించిన పంట కొనను అనే మాటలు ఎక్కడా వినలేదన్నారు. రెండు పార్టీలు రాజకీయాల కోసం రైతులను నాశనం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. బండి సంజయ్.. సీఎం అవినీతి తెలుసు అంటారు.. కేసీఆర్..సంజయ్ నేను టచ్ చెయ్ అంటున్నారని.. ఇద్దరూ కలిసి ఆడుతున్న నాటకమని ఆయన విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement