Thursday, April 18, 2024

కాంగ్రెస్ ఛ‌లో రాజ్ భ‌వ‌న్ ఉద్రిక్తం – భ‌ట్టి,సీత‌క్క‌తో స‌హా ప‌లువురు అరెస్ట్

హైదరాబాద్ – అదానీ షేర్ల స్కాం లో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఈ చలో రాజభవన్ కి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో నేడు ఉదయం నాంప‌ల్లి కాంగ్రెస్ కార్యాల‌యం నుంచి భారీగా కాంగ్రెస్ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు రాజ్ భవన్ వద్దకు ర్యాలీగా వచ్చారు.. వారిని రాజ్ భవన్ వద్ద పోలీసులు నిలువ‌రించారు.. దీంతో అక్క‌డ తీవ్ర ఉద్రిక్త‌త ప‌రిస్థితులు చోటు చేసుకున్నాయి.. బారికేడ్స్ దాటుకుని రాజ్ భ‌వ‌న్ లోకి వెళ్లేందుకు ప్ర‌య‌త్నించిన కాంగ్రెస్ నేత‌ల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.. అరెస్ట్ అయిన వారిలో సిఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క్, ఎమ్మెల్యే సీత‌క్క‌, అంజ‌న్ కుమార్ యాద‌వ్ త‌దిత‌రులు ఉన్నారు. ఈ సంద‌ర్బంగా భ‌ట్టి మాట్లాడుతూ, ప్రధాని మోదీ – అదాని బావా, బామ్మర్దులు అని.. వాళ్ల బంధం విడదీయరానిదని అన్నారు. ఆదానిని ఎప్పుడు అరెస్టు చేస్తారని దేశం ఎదురు చూస్తుందన్నారు. కేంద్రం దుర్మార్గంగా వ్యవహరిస్తుందన్నారు. ప్రతిపక్షాలపై దర్యాప్తు సంస్థలను ఉసిగొలుపుతుందని ఆరోపించారు. ఎల్ఐసి, ఎస్బిఐ సంస్థలు డబ్బులను అదానికి దోచి పెట్టారని మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement