రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల MLC ఎలక్షన్ నామినేషన్ సందర్భంగా తెరాస పార్టీ చేసిన గుండాయిజం, రౌడీయిజం, దౌర్జన్యం పై చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు తెలంగాణ రాష్ట్ర పంచాయత్ రాజ్ ఛాంబర్ ప్రెసిడెంట్ చింపుల సత్యనారాయణ రెడ్డి, రాష్ట్ర ఎంపీటీసీల సంఘం అధ్యక్షులు చింపుల శైలజ ఫిర్యాదు చేశారు.
తెరాస దౌర్జన్యం చేసి ఎవరినీ నామినేషన్ వేయనీయకుండా చేసిన కారణంగా ఎలక్షన్ ప్రాసెస్ ని పూర్తిగా రద్దు చేసి మళ్లీ కొత్త ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వాలని కోరడం జరిగింది. ఎలక్షన్ ని రద్దు చేయకపోతే హైకోర్టుకి వెళ్లాలని నిర్ణయించామని కూడా వారికీ తెలపడం జరిగింది. వీరి వెంట తెలంగాణ పంచాయతీ రాజ్ ఛాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పసులూరి అశోక్ రావు, దేశమొల్ల అంజన్న, మందిపల్ వెంకట్, తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..