Sunday, April 14, 2024

మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్, ఎస్పీ పర్యట‌న‌.. అభివృద్ధి ప‌నుల‌పై ఆరా!

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలోని మావోయిస్టు ప్ర‌భావిత ప్రాంతాల్లో క‌లెక్ట‌ర్‌, ఎస్పీ ఇవ్వాల ప‌ర్య‌టించారు. జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్, ఎస్పీ సునీల్ దత్ చర్ల మండలంలోని పూసుగుప్ప, ఉంజుపల్లి గ్రామాల్లో పర్యటించారు. అక్కడ పోలీసు బలగాల కోసం ఏర్పాటు చేసిన జాయింట్ టాస్క్‌ఫోర్స్‌ క్యాంపులను సందర్శించారు. ఉంజుపల్లి, వద్దిపేట గ్రామాల ప్రజలతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.

వారి సమస్యలను అడిగి తెలుసుకుని త్వరలో పరిష్కరిస్తామని కలెక్టర్, ఎస్పీ హామీ ఇచ్చారు. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజల సంక్షేమం కోసం ప్ర‌భుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంద‌ని తెలిపారు. కార్యక్రమంలో సీఆర్‌పీఎఫ్ 81 బెటాలియన్ సీనియర్ కమాండెంట్ సంజీవ్ కుమార్, ఓఎస్డీ తిరుపతి ఐపీఎస్, భద్రాచలం ఏఎస్పీ రోహిత్ రాజు, చర్ల సీఐ అశోక్, ఎస్బి సీఐ రాజు, ఎస్సైలు రాజు వర్మ, వెంకటప్పయ్య పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement