Saturday, April 20, 2024

కలెక్టర్ కుటుంబానికి అండగా ఉంటా: కేటీఆర్ భరోసా

కరోనాతో మరణించిన సిరిసిల్ల జిల్లా అడిషనల్ కలెక్టర్ అంజయ్య  కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని పురపాలక శాఖ మంత్రి కేటీ రామరావు తెలిపారు. హైదరాబాద్ ప్రగతి భవన్ లో మంత్రి కేటీఆర్ ను అంజయ్య కుటుంబ సభ్యులు కలిశారు. అంజయ్య చాలా సమర్థ అధికారి అని, ఆయన సిరిసిల్ల జిల్లా అడిషనల్ కలెక్టర్ గా తన బాధ్యతలను అద్భుతంగా నిర్వహించారని ఈ సంద్భంగా మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. అంజయ్య కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని కల్పించడంతోపాటు అన్ని విధాలుగా వ్యక్తిగతంగా అండగా ఉంటానని మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్‌ ఆర్‌.అంజయ్య కొవిడ్‌తో చికిత్స పొందుతూ ఇటీవల హైదరాబాద్‌లో మృతి చెందిన విషయం తెలిసిందే. సూర్యాపేట జిల్లా అరవపల్లి మండలంలోని జాజిరెడ్డి గూడెం గ్రామానికి చెందిన అంజయ్య గతేడాది ఫిబ్రవరిలో పదోన్నతిపై సిరిసిల్ల అదనపు కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు.

ఇది కూడా చదవండి: ప్రధాని మోదీకి ఏపీ సీఎం జగన్ లేఖ

Advertisement

తాజా వార్తలు

Advertisement