Wednesday, April 24, 2024

కొత్త‌గూడెం జిల్లాలో కోడిపందాల డెన్‌.. న‌గ‌దు, బైకులతో పాటు నిందితుల అరెస్టు

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో నిర్వ‌హిస్తున్న కోడి పందాల స్థావ‌రంపై పోలీసులు దాడులు చేశారు. ఇవ్వాల (సోమ‌వారం) రాత్రి జ‌రిపిన ఈ దాడుల్లో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. దమ్మపేట మండలం ముకుందాపురంలో కోడిపందాల నిర్వ‌హిస్తున్న క‌చ్చిత‌మైన స‌మాచారంతో పోలీసులు ఈ దాడులు నిర్వ‌హించిన‌ట్టు తెలుస్తోంది. కాగా, ఈ దాడుల్లో ఘ‌ట‌నా స్థ‌లం నుంచి రూ.8620 నగదుతో పాటు 6 బైకులు, 14కోడి కత్తులు స్వాధీనం చేసుకోగా.. రెండు కోళ్లను కూడా పోలీసులు తీసుకెళ్లిన‌ట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement