Friday, April 26, 2024

సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం.. నిరంజన్ రెడ్డి

వనపర్తి, పెద్దమందడి: సీఎంఆర్ఎఫ్ పేదలకు ఓ వరమని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. గోపాల్ పేట మండలం పరిధిలోని పొలికెపాడ్ ఆముదాల కుంట తండాకు చెందిన శ్రీను చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన రూ.2.50 లక్షల ఎల్ఓసీని హైదరాబాద్ మంత్రుల నివాస సముదాయంలో సోమవారం లబ్ధిదారునికి మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అందజేశారు. ఎల్ఓసీ కోసం కృషి చేసిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా కృతజ్ఞలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ… అనారోగ్యానికి గురై ఖర్చులు, వైద్యానికి అయిన ఆసుపత్రి బిల్లులు చెల్లిస్తే సీఎం రిలీఫ్ ఫండ్ నుండి అమౌంట్ మంజూరు చేస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement