Tuesday, April 23, 2024

రేపు న‌ల్ల‌గొండ జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్న సీఎం కేసీఆర్.. ప‌వ‌ర్ ప్లాంట్ల నిర్మాణ ప‌నుల ప‌రిశీల‌న‌

సీఎం కేసీఆర్ రేపు (సోమ‌వారం) న‌ల్ల‌గొండ జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. యాదాద్రి థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ప్లాంట్ నిర్మాణ ప‌నుల‌ను మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డితో క‌లిసి ప‌రిశీలించ‌నున్నారు. 2015లో ప్రారంభ‌మైన ఈ ప్లాంట్ ప‌నులు 70 శాతం పూర్త‌య్యాయి. 5 వేల ఎక‌రాల్లో రూ.30 వేల కోట్ల‌తో 5 ప‌వ‌ర్ ప్లాంట్ల‌ను నిర్మిస్తున్నారు. ఒక్కో ప్లాంట్ నుంచి 800 మెగావాట్ల విద్యుత్ ఉత్ప‌త్తి చేయ‌నున్నారు. మొత్తం 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్ప‌త్తి ల‌క్ష్యంగా ప‌వ‌ర్ ప్లాంట్ నిర్మాణం జ‌రుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement