Friday, April 19, 2024

ఆగస్టు 2న నాగార్జున సాగర్ కి సీఎం కేసీఆర్..

సీఎం కేసీఆర్ మరోమారు నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉప ఎన్నికల సమయంలో నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో మిగిలి ఉన్న అభివృద్ధి అంశాలను నెరవేరుస్తామని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ఈ మేరకు సమస్యలపై చర్చించి, తగిన నిర్ణయాలు తీసుకుని, అక్కడికక్కడే ఆదేశాలు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్‌ వస్తున్నట్లు జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు. ఆగస్టు 2న ఆయన నాగార్జునసాగర్‌లో పర్యటించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైనట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో హాలియా పట్టణంలో ఏర్పాట్లను ఎమ్మెల్యే నోముల భగత్‌, కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, ఎస్పీ రంగనాథ్‌తో కలిసి పరిశీలించారు.

ఇది కూడా చదవండి: జగన్ అక్రమాస్తుల కేసు..విచారణకు సిద్దంగా ఉండాలన్న సీబీఐ కోర్టు

Advertisement

తాజా వార్తలు

Advertisement