Thursday, April 25, 2024

రేప‌టి నుండి యాదాద్రి బ్ర‌హ్మోత్స‌వాలు.. ప‌ట్టు వ‌స్త్రాలు అంద‌జేయ‌నున్నసీఎం కేసీఆర్

రేప‌టి నుండి ప్రారంభంకానున్నాయి యాదాద్రి బ్ర‌హ్మోత్స‌వాలు. ఈ మేరకు బ్రహ్మోత్సవాలకు సంబంధించిన కార్యక్రమాలను ఆలయ ఈవో ప్రకటించారు. బ్రహ్మోత్సవాల నేపద్యంలో ఈనెల 21వ తేదీ నుండి మూడవ తేదీ వరకు ఆలయంలో నిత్యం నిర్వహించే ఆర్జిత సేవలు, సుదర్శన నరసింహ హోమం, నిత్య కళ్యాణం, శాశ్వత బ్రహ్మోత్సవాలను తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.రేపు ఉదయం 10 గంటలకు విశ్వక్సేన ఆరాధనతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయి. అయితే బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇప్పటికే ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చేదిద్దారు. స్వామి వారి తిరుకల్యాణోత్సవం రోజున ప్రభుత్వం తరఫున సీఎం కేసీఆర్ పట్టు వస్త్రాలు అందజేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement