Saturday, April 20, 2024

కొల్లూరు డబుల్ బెడ్రూం ఇండ్లు రెడీ

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణలను శర వేగంగా పూర్తి చేస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో నిర్మాణాలను పూర్తి చేసింది. తాజాగా సంగారెడ్డి జిల్లా కొల్లూరులో డబుల్‌ బెడ్రూం ఇండ్ల సముదాయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలంలోని కొల్లూరులో రూ.1,408.09 కోట్లతో ప్రభుత్వం ఎస్‌+9, ఎస్‌10, ఏ+11 అంతస్తుల్లో 15,600 ఇండ్లను అత్యున్నత ప్రమాణాలతో ఆదర్శ టౌన్‌షిప్‌గా నిర్మించింది. దీనిని త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభించి, లబ్ధిదారులకు అందజేయనున్నారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. కొల్లూరులో ఒకేచోట 15,600 రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణం చేపట్టామని, అతిపెద్ద ఆత్మగౌరవ వేదికగా నిలవనున్నదని పేర్కొన్నారు. ఔటర్‌ను ఆనుకుని నిర్మాణమైన గృహ సముదాయం అబ్బురపరిచేలా ఉన్నదని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement