Thursday, April 25, 2024

పట్టణ,పల్లె ప్రగతి… అదనపు కలెక్టర్లకు నిధులు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో చేపట్టాల్సిన పనుల కోసం అదనపు కలెక్టర్లకు నిధులు కేటాయిస్తూ సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అదనపు కలెక్టర్లు, డీపీఓలతో నిర్వహించిన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పనుల మంజూరు కోసం అదనపు కలెక్టర్లకు రూ. 25 లక్షల చొప్పున నిధులు కేటాయించారు.  ప్రాధాన్య క్రమంలో పల్లెలు, పట్టణాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు. సమావేశంలో పలు అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. అనంతరం సీఎం కేసీఆర్‌ నిధుల కేటాయింపునకు ఆమోదం తెలిపారు. అదేవిధంగా అదనపు కలెక్టర్లకు కొత్త కార్లను సైతం అందజేశారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement