Tuesday, March 26, 2024

TRS ఎమ్మెల్సీ అభ్యర్థులకు సీఎం కేసీఆర్ ఫోన్

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్దల ఎమ్మెల్సీ ఎన్నికల టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు శంబీర్ పూర్ రాజు, పట్నం మహేందర్ రెడ్డిలకు సీఎం కేసీఆర్ ఫోన్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల దాఖలుపై ఢిల్లీ నుండి మంగళవారం రాత్రి సీఎం కేసీఆర్ ఆరా తీశారు. రంగారెడ్డి జిల్లాలో రెండు నామినేషన్లు మాత్రమే దాఖలు కావడంతో ఇక ఏకగ్రీవం కానున్నాయి.  ఈ నేపథ్యంలో శంబీర్ పూర్ రాజు, పట్నం మహేందర్ రెడ్డిలకు సీఎం కేసీఆర్ ఫోన్ లో శుభాకాంక్షలు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement