Thursday, April 18, 2024

బర్త్ డే నాడు కేసీఆర్ మనవడు ఏం చేశాడంటే..

తెలంగాణ సీఎం కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ త‌న‌యుడు హిమాన్షు.. త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. త‌న బాబాయి, రాజ్య‌స‌భ స‌భ్యులు జోగిన‌ప‌ల్లి సంతోష్ కుమార్‌తో క‌లిసి హిమాన్షు.. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో మొక్క‌లు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్, హరితహారం కార్యక్రమంలో ప్ర‌తి ఒక్క‌రూ భాగస్వాములై మొక్కలు నాటాలని ఈ సంరద్భంగా హిమాన్షు పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణకు అందరు పాటుపడాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలని సూచించారు. కాగా, తాను రాజకీయాల్లో రానని ఇటీవల స్టేట్ మెంట్ ఇచ్చి హిమాన్షు వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement