Friday, March 29, 2024

సీజేఐ ఎన్‌వీ రమణ యాదాద్రి పర్యటనలో మార్పు!

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్‌వీ రమణ యాదాద్రి పర్యటనలో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. షెడ్యూల్ ప్రకారం సోమవారం యాదాద్రిని దర్శించుకోవాలనుకున్నారు. అయితే, సోమవారం ఎన్వీ రమణ తండ్రి తిథి కావడంతో పర్యటన వాయిదా వేశారు. మంగళవారం భారత న్యాయమూర్తి హోదాలో మొదటిసారి యాదాద్రిని ఎన్వీ రమణ దర్శించుకోనున్నారు. సీజేఐ హోదాలో వస్తుండటంతో ఘనంగా స్వాగతం పలికేందుకు ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేస్తోంది. సీఎం కేసీఆర్‌ ఆలయ పునర్నిర్మాణ తీరును స్వయంగా జస్టిస్‌ ఎన్వీ రమణకు వివరించనున్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement