Saturday, April 20, 2024

నటి కరాటే కళ్యాణి నివాసంపై చైల్డ్ వెల్ఫేర్‌ అధికారుల దాడులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: నటి కరాటే కళ్యాణి నివాసంపై స్త్రీశిశు సంక్షేమశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. పలువురు చిన్నారులను కిడ్నాప్‌ చేయడంతోపాటు 2 నెలల పిల్లలను కళ్యాణి కొనుగోలు చేసినట్లు ఫిర్యాదులు రావడంతో దాడులకు పూనుకున్నారు. నెలల పిల్లలను అడ్డుపెట్టుకుని పలువురి వద్ద డబ్బులు వసూలు చేసినట్లు ఫిర్యాదులు అందాయి. దీంతో ఆమెను విచారించేందుకు స్త్రీ శిశు సంక్షేమశాఖ అధికారులు సిద్ధమయ్యారు. ఆదివారం కళ్యాణి నివాసం ఉంటున్న రాజీవ్‌నగర్‌లోని శ్రీలక్ష్మీ నిలయానికి అధికారులు చేరుకుని విచారించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement