Thursday, April 25, 2024

ఎమ్మెల్యే సీతక్కకు ధైర్యం చెప్పిన చంద్రబాబు.. థాంక్స్ అన్నా అంటూ..

ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్కను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పరామర్శించారు. సీతక్క తల్లి సమ్మక్క హైదరాబాదులోని ఏషియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో సమ్మక్కను ఆస్పత్రిలో చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఆమె ఆరోగ్యం గురించి ఎమ్మెల్యే సీతక్కతోనూ, ఏఐజీ వైద్యులతోనూ మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీతక్క భావోద్వేగాలకు గురయ్యారు. ధైర్యంగా ఉండాలని పేర్కొన్నారు. సీతక్క నిరాడంబరత, ప్రజాసేవ, క్రమశిక్షణ తదితర అంశాలను చంద్రబాబు అక్కడి వైద్యులకు వివరించారు. ఆమె అవలంబిస్తున్న సేవా తత్పరత పట్ల చంద్రబాబు అభినందించారు.

తన గురించి చంద్రబాబు అంతటి నేత ప్రత్యేకంగా వివరించడంతో సీతక్క ఉద్వేగానికి లోనయ్యారు. ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. థాంక్స్ అన్నా అంటూ సీతక్క తన ట్విట్టర్ అకౌంట్లో చంద్రబాబు సందర్శన వీడియోను పంచుకున్నారు. కాగా, గతంలో సీతక్క టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న సంగతి తెలిసిందే.

ఇది కూడా చదవండి: గాంధీ భవన్‌లో కాంగ్రెస్ నేతల సత్యాగ్రహ దీక్ష

Advertisement

తాజా వార్తలు

Advertisement