Wednesday, April 17, 2024

తెలంగాణలోనూ టీడీపీకి పూర్వవైభవం – చంద్ర బాబు ధీమా

హైదరాబాద్ – తెలంగాణలో కూడా తప్పకుండా టీడీపీకి పూర్వవైభవం వస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో టీడీపీ రావాల్సిన అవసరం ఉందని, ఇది చారిత్రక అవసరం అని స్పష్టం చేశారు హైదరాబాదులోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో టీడీపీ తెలంగాణ విభాగం అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో జరిగిన తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవ సభలో చంద్రబాబు మాట్లాడుతూ,కాసాని జ్ఞానేశ్వర్ నాయకత్వంలోని తెలంగాణ టీడీపీ టీమ్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని తెలిపారు. ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ పేరిట వారు చేపడుతున్న కార్యక్రమం ఎంతో ఉత్సాహభరితంగా సాగుతోందని కొనియాడారు. తెలంగాణ టీమ్ బాగా పనిచేస్తోందని, ఇంకా స్పీడ్ పెంచాలని పిలుపునిచ్చారు.

.

తెలంగాణలో కూడా తప్పకుండా టీడీపీకి పూర్వవైభవం వస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో టీడీపీ రావాల్సిన అవసరం ఉందని, ఇది చారిత్రక అవసరం అని స్పష్టం చేశారు. కాగా, టీడీపీలో శాశ్వత సభ్యత్వం కోసం రూ.5 వేలు రుసుం నిర్ణయించామని చంద్రబాబు వెల్లడించారు. టీడీపీని క్రియాశీలకం చేసేందుకు దోహదపడాలని పిలుపునిచ్చారు. ప్రజలను భాగస్వాములను చేసి పార్టీ నడపాలనేది తన సంకల్పం అని చంద్రబాబు స్పష్టం చేశారు. తెలంగాణకు, ఏపీకి వ్యత్యాసం ఉండొచ్చని, కానీ సంకల్పం గొప్పదైతే అందరం పైకి వచ్చే అవకాశం ఉంటుందని అన్నారు. అలాంటి సంకల్పానికి నాంది పలికిన రోజు మార్చి 29 అని, టీడీపీ 41వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మరొక్కసారి తెలియజేస్తున్నానని వివరించారు. సర్వం కోల్పోయినా పార్టీ జెండా మోస్తున్న నా కుటుంబ సభ్యుల్లాంటి కార్యకర్తలకు శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నానని పేర్కొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement