Friday, April 26, 2024

ఎండ‌లు మండుతున్నాయి – త‌స్మాత్ జాగ్ర‌త్త‌…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : రోజురోజుకి ఎండల తీవ్రత పెరుగుతున్నందున కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్రాలకు పలు మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రజలకు ఎటు-వంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు చర్యలు చేపట్టాలని తెలిపింది. అన్ని ఆరోగ్య కేంద్రాల్లో ఎండ తీవ్రతను తట్టు-కోనేందుకు తగిన సౌకర్యాలు ఉండేలా చూడాలని చెప్పింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి కూడా లేఖ రాసింది. ముందస్తు అప్రమత్తత అవసరమని సూచించింది. ప్రజలు అనారోగ్యం బారిన పడకముందుగానే తగు జాగ్రత్తల దిశగా వారిలో అవగాహన కల్పించేందుకు ఆరోగ్య శాఖ కార్యా చరణ ప్రణాళికతో ముందుకు సాగాలని కేంద్రం తెలిపింది.


వడదెబ్బ బాధితుల వివరాలు నమోదు
నిత్యం ఉష్ణోగ్రత తీవ్రత, వాతా వరణ మార్పులకు సంబం ధించిన వివరాలను అందించనున్నట్టు- తెలి పింది. ఫలితంగా రాష్ట్రాల్ల్రో పట్టణ, జిల్లా స్థాయిలోని వడదెబ్బ సమస్యలను అరికట్టేలా చర్యలు తీసుకునేందుకు వీలవుతుం దని పేర్కొంది. ఇక రాష్ట్రాల్రు సైతం తప్పక వడదెబ్బ బాధితుల వివరాలను కేంద్ర ప్రభుత్వ ఇంటిగ్రే-టె-డ్‌ హెల్త్‌ ఇన్‌ఫర్మేషన్‌ ప్లాట్‌ ఫాం ఐహెచ్‌ఐపీలో పొందుపరచాలని కోరింది. ఆరోగ్య కేంద్రాల్లో తగిన సౌకర్యాలు ఉండాలి: వేడి తీవ్రత పెరుగు తున్న నేపథ్యంలో వడదెబ్బ బాధితుల సంఖ్య పెరిగేందుకు అవకాశం ఉందని చెప్పింది. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేదుకు అన్ని ఆరోగ్య కేంద్రాల్లో సరైన మొత్తంలో మందులు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు-, ఐవీ ప్లnూయిడ్లు, ఐస్‌ ప్యాక్‌లు అందు బాటు-లో ఉండేలా చూడాలని తెలిపింది. ప్రతి ఒక్కరికి ఎండ తీవ్రతపై అవగాహన ఉండేందుకు తగిన కార్యక్రమాలు చేపట్టాలని కేంద్రం ఆదేశించింది. ఉష్ణోగ్రత పెరగితే ప్రజలు పడే ఇబ్బందులను వివరించింది.

స్థానిక సంస్థల భాగస్వామ్యంతో అప్రమత్తం
అవసరమైతే తప్ప ప్రజలు మధ్యహ్నం సమయంలో బయటకి రావద్దని, ఆ దిశగా స్థానిక సంస్థల పర్యవేక్షణలో ఇంటింటి ప్రచారం నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం తగిన ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వేసవిలో ఎండతీవ్రత వల్ల అనారోగ్యం బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృత ప్రచారం కల్పించాలని లేఖలో పేర్కొంది. వేసవిలో నీటిని ఎక్కువగా తీసుకోవటంతో పాటు-.. చల్లని ప్రదేశాల్లో ఉండాలని ప్రజలకు సూచించింది. జనాభా ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో చల్లటి నీటి సదుపాయం కల్పించాలని తెలిపింది. ముఖ్యంగా అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న 12 నుంచి 3 గంటల లోపు ఇళ్ల నుంచి బయటకు రావద్దని వెల్లడించింది. చిన్నపిల్లలను మధ్యాహ్నం బయటకి రాకుండా ఉండేలా వారి తల్లిదండ్రులకు తగిన సూచనలు ఇవ్వాలని చెప్పింది. వేసవి కాలంలో ఎండ తీవ్రత ఎక్కవగా ఉంటు-ందని అందువల్ల ఇప్పటి నుంచే సరైన చర్యలు తీసుకోవాలని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement