Wednesday, April 17, 2024

ట్యాంకు దిమ్మెలు కూలి విద్యార్థి మృతి .. మరో ఇద్దరికీ గాయాలు

సూర్యాపేట:చివ్వెంల మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిరావు పూలే (నాగారం) వసతి గృహంలో విద్యార్థులు స్నానం చేస్తుండగా ట్యాంకు దిమ్మెలు కూలి ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన విద్యార్థులను సూర్యాపేట జనరల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మోతె మండలం అప్పన్నగూడెం గ్రామానికి చెందిన ఐదో తరగతి విద్యార్ది రావుట్ల పవన్(11) మృతి చెందాడు. మద్దిరాల మండలం చందుపట్ల గ్రామానికి చెందిన సుశాంత్, శాలిగౌరారం మండలం ఎస్ లింగోటం గ్రామానికి చెందిన మరో విద్యార్థి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి లో చికిత్స పొందుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement