Thursday, April 18, 2024

ఆత్మ‌హ‌త్య‌లపై సీబీఐ విచార‌ణ జ‌ర‌పాలి : గ‌వ‌ర్న‌ర్ ను కోరిన‌ బీజేపీ నేత‌లు

తెలంగాణ బీజేపీ నేత‌లు గ‌వ‌ర్న‌ర్ ను క‌లిశారు. ఖమ్మం, రామాయంపేట్ ఘటనలపై జోక్యం చేసుకోవాలని, ఆత్మహత్యలపై సీబీఐ విచారణ జరపాలని బీజేపీ నేతల బృందం గవర్నర్‌ తమిళి సైను కోరింది. వారివి ఆత్మహత్యలు కావని… టీఆర్ఎస్ ప్రభుత్వ హత్యలని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. బాధితులకు అన్యాయం జరుగుతోందన్నారు. ఎమ్మెల్యే వనమా కొడకు, నిర్మల్ ఘర్షణలపై విచారణ జరపాలని కోరారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకూ పోరాడుతామని తెలిపారు. అయితే బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని గవర్నర్ స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement