Friday, April 19, 2024

నకిలీ ఐపీఎస్ కేసులో.. మరో నలుగురికి సీబీఐ నోటీసులు

నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ శ్రీనివాస్ కేసులో హైద‌రాబాద్ కు చెందిన మరో నలుగురు వ్యాపార‌వేత్త‌ల‌కు నోటీసులు జారీ చేసింది. యూసుఫ్ గూడకు చెందిన వ్యాపారవేత్త మేలపాటి చెంచు నాయుడుకు నోటీసులు అందజేశారు అధికారులు. సీబీఐ కేసుకు సంబంధించి సెటిల్ మెంట్ చేస్తానని శ్రీనివాస్ చెప్పినట్టు సమాచారం. అదేవిధంగా మరో వ్యాపారవేత్త వెంకటేశ్వర రావు కుమారుడికి ఉద్యోగం ఇప్పిస్తానని శ్రీనివాస్ హామీ ఇచ్చాడు. ఈ మేరకు రేపు సీబీఐ ఎదుట విచారణ హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement