Wednesday, March 27, 2024

గ్రీన్ఇండియా చాలెంజ్.. మొక్కలు నాటిన కేర్ వైద్య బృందం

రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ ఉద్యమంలా కొనసాగుతోంది. గ్రీన్ఇండియా చాలెంజ్ లో భాగంగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవం పురస్కరించుకుని హైటెక్ సిటీ కేర్ హాస్పిటల్ వైద్యబృందం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా డా.రవి కిరణ్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ నర్స్ స్వర్ణ,డా.సత్యనారాయణ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement