Saturday, April 20, 2024

స్కూటీని ఢీకొన్న కారు : ఇద్ద‌రికి తీవ్ర‌గాయాలు

కారు స్కూటీని ఢీకొని ఇద్దరికి తీవ్ర‌గాయాలైన ఘ‌ట‌న మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని జడ్చర్ల మండలం మాచారం సమీపంలో ఎన్ హెచ్ 44 పై వెళ్తున్న‌ స్కూటీని కారు వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ప్రయాణిస్తున్న చౌటగడ్డ తండాకు చెందిన కోటేష్, ఆయన కూతురు మనస్వికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రికి తరలించారు. గురుకుల కళాశాలలో ఇంటర్ చదువుతున్న మనస్వి పోచమ్మ పండుగకు ఇంటికి వచ్చింది. అయితే ఈరోజు తిరిగి గురుకులానికి వెళ్తుండ‌గా… ఈ ప్రమాదం సంభవించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement