Thursday, April 25, 2024

తండ్రి మ‌ర‌ణాన్ని మ‌ర‌వ‌లేక .. మ‌న‌స్తాపంతో కూతురు ఆత్మ‌హ‌త్య

తాండూరు : తండ్రి మ‌ర‌ణాన్ని త‌ట్టుకోలేని కూతురు ఉరేసుకుని బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డింది. ఈ ఘ‌ట‌న వికారాబాద్ జిల్లా తాండూరు ప‌ట్ట‌ణంలో జ‌రిగింది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. తాండూరు ప‌ట్ట‌ణం మ‌ల్ రెడ్డిప‌ల్లి గ్రామానికి చెందిన ప‌ట్లోళ్ల శివారెడ్డి కూతురు నిజాంపేట్‌లో ఇంట‌ర్ సెకండ్ ఇయ‌ర్ చ‌దువుతోంది. శివారెడ్డి ప‌ది రోజుల క్రితం అనారోగ్యంతో క‌న్నుమూశారు. అప్ప‌టి నుంచి ఆయ‌న కూతురు తీవ్ర మ‌న‌స్థాపానికి గుర‌య్యింది.

తండ్రి లేని లోకంలో ఉండ‌లేద‌ని ప‌దే ప‌దే బాధ‌ప‌డుతూ కుటుంబీకులు, బంధువుల ముందు వేద‌న చెందింది. ఈ క్ర‌మంలో శుక్ర‌వారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. తండ్రి లేకుండా ఉండ‌లేన‌ని చెప్పిన మాట‌ను నిజం చేస్తూ కుటుంబానికి తీర‌ని శోకం మిగిల్చింది. ఒకే కుటుంబంలో రోజుల వ్య‌వ‌ధిలోనే తండ్రి, కూతురు క‌న్నుమూయ‌డంతో ఈ సంఘ‌ట‌న మ‌ల్ రెడ్డిప‌ల్లిలో విషాదం నింపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement