Thursday, March 28, 2024

సూర్యాపేటలో బస్సు బోల్తా

సూర్యాపేట జిల్లాలోని మునగాల మండలం ముకుందాపురం శివారులో ఓ  ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ముకుందాపురం వద్ద 65వ జాతీయ రహదారిపై లారీని ఓవర్ టేక్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే,ప్రమాదం నుంచి వారు సురక్షితంగా బయటపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement