Saturday, April 20, 2024

ఖిలా వరంగల్ లో దారుణ‌ హత్య..!

వరంగల్, (ప్రభ న్యూస్) : ఖిలా వరంగల్‌లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికంగా ఉన్న మై మాస్టర్ స్కూల్ సమీపంలో ఉన్న పొదల్లో ఈరోజు ఉదయం గుర్తు తెలియని వ్యక్తి హత్యకు గురైనట్లు స్థానికులు గుర్తించారు. సదురు వ్యక్తిని ఎవరో కొట్టి చంపినట్లుగా అనుమానిస్తున్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటన స్థలానికి చేరుకొని వివరాలు ఆరా తీస్తున్నారు. మృతుడు రంగాశాయిపేటకు చెందిన కోక వెంకన్నగా గుర్తించినట్లు సమాచారం. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement