Friday, April 26, 2024

న‌ల్గొండ జిల్లాలో ఘోరం.. కొడుకును గొంతునులిమి చంపి, ఆపై త‌నూ..

న‌ల్ల‌గొండ జిల్లాలో ఘోరం జ‌రిగింది. నార్క‌ట్‌ప‌ల్లి మండ‌లం ఔర‌వాని గ్రామాంలో ఈ ఘ‌ట‌న ఇవ్వాల జ‌రిగింది. ఓ మ‌హిళ తన రెండేళ్ల కుమారుడు సాత్విక్ ని గొంతు నులిమి చంపేసింది. ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకుంది. కాగా మృతురాలిని లాస్యగా చెబుతున్నారు. అయితే దీనికి కుటుంబ‌ కలహాలే కారణం అని పోలీసులు భావిస్తున్నారు. ఇంత ఘోర‌మైన డెసిష‌న్ తీసుకోవ‌డానికి కార‌ణం ఏంట‌న్న‌దానిపై ఆరా తీస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన మిగ‌తా వివ‌రాల‌ను ద‌ర్యాప్తు త‌ర్వాత వెల్ల‌డిస్తామ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement