Tuesday, April 23, 2024

బండిపై భగ్గుమన్న బీఆర్ఎస్ శ్రేణులు… సంజయ్ దిష్టిబొమ్మలు దగ్ధం..

ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై అనుచిత వాఖ్యలు చేసిన కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై మానకొండూర్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భ‌గ్గుమన్నాయి. ఒక బాధ్యత గల ఎంపీ హోదాలో ఉండి మహిళ పట్ల కనీస గౌరవం లేకుండా, సభ్యసమాజం తలదించుకునే విధంగా అసభ్య పదజాలంతో కవితను అవమానించేలా మాట్లాడిన బండి సంజయ్ దిష్టిబొమ్మలను శనివారం మానకొండూర్ నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో దగ్ధం చేసి, పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.


ఇందులో భాగంగా తిమ్మాపూర్ బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో అల్గునూర్ చౌరస్తాకు తరలివచ్చి బండి సంజయ్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ, ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం బండి సంజయ్ ని వెంటనే అరెస్టు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ తిమ్మాపూర్ మండలం అధ్యక్షుడు రావుల రమేష్, రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డిలు ఎల్ఎండీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement