Saturday, April 20, 2024

రేపు నాందేడ్ కు ముఖ్య‌మంత్రి కెసిఆర్

హైద‌రాబాద్ – రాష్ట్ర బడ్జెట్‌ ఆమోదానికి ఆదివారం ఉదయం జరిగే కేబినెట్‌ భేటీ ముగిసిన అనంతరం బేగంపేట విమానాశ్రయం నుంచిప్రత్యేక విమానంలో నాందేడ్‌ చేరుకోనున్నారు సీఎం కేసీఆర్ . తొలుత గురుద్వారాను సందర్శించుకొని అనంతరం నాందేడ్ లో నిర్వ‌హిస్తున్న బిఆర్ఎస్ పార్టీ చేరికల సభకు హాజ రవుతారు. మధ్యాహ్నం సభలో కేసీఆర్‌ ప్రసంగించనున్నారు.

ఈ సభలో సీఎం సమక్షంలో మహారాష్ట్ర వాసులు భారీ ఎత్తున బీఆర్‌ఎస్‌లో చేరనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. బీఆర్‌ఎస్‌ సభ అక్కడి గురుద్వార సచ్‌ఖండ్‌ బోర్డు మైదానంలో జరగనుంది. గురుద్వార పరిసరాల్లో ఉన్న ఈ మైదానంలో సభకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తిచేసి నట్లు ప్రభుత్వ విప్‌, చెన్నూర్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ ట్విట్టర్‌లో తెలిపారు. సభ విజయవంతం చేసేందుకు ఎంపీ బీబీపాటిల్‌, ఇతర సీనియర్‌ నేతలతో కలిసి సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement