Tuesday, April 23, 2024

యుద్ధప్రాతిపదికన బ్రిడ్జి పనులు .. ప్రభుత్వ విప్ బాల్క సుమన్

చెన్నూరు నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ తుంతుంగ వాగుపై బ్రిడ్జి నిర్మాణ పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు. బుధవారం కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను పరిశీలించారు. యుద్ధ ప్రాతిపదికన బ్రిడ్జి పనులను పూర్తి చేయాలని గుత్తేదారులకు ఆదేశించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని, దశాబ్దాల కాలంగా లేని అభివృద్ధిని మూడేళ్లలో చేసి చూపమన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పెద్దపీట వేశారని, కోట్లాది రూపాయలు మంజూరు చేస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement