Thursday, March 28, 2024

Breaking : టిఆర్ఎస్ లో చేరిన – మునుగోడు నేత పల్లె రవికుమార్ గౌడ్ దంపతులు

కేటీఆర్ తో హైదరాబాద్ లో భేటీ అయ్యారు మునుగోడు కాంగ్రెస్ నేత పల్లె రవికుమార్ గౌడ్ దంపతులు. రవికుమార్ గౌడ్ భార్య కల్యాణి ప్రస్తుతం చండూరు ఎంపీపీగా కొనసాగుతుంది.పార్టీ కండువా కప్పి పల్లె రవి దంపతులను టిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు.ఉద్యమ కాలం నుంచి మాతో కలిసి పని చేసిన పల్లె రవికుమార్ మళ్లీ తెరాసా పార్టీ కుటుంబంలోకి రావడం సంతోషంగా ఉందన్నారు కేటీఆర్. ప్రస్తుతం కీలకమైన మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా పార్టీ గెలుపు కోసం టిఆర్ఎస్ లో చేరేందుకు ముందుకు వచ్చిన పల్లె రవికుమార్ కు ధన్యవాదాలు తెలిపారు. పాత మిత్రుడు పల్లె రవికుమార్ కి కచ్చితంగా భవిష్యత్తులో మరిన్ని మంచి రాజకీయ అవకాశాలను పార్టీ కల్పిస్తుందన్నారు.మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు తెరాసా నేతలు కర్నె ప్రభాకర్, బొంతు రామ్మోహన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement