Thursday, April 25, 2024

Breaking: హైద‌రాబాద్‌లో ఘోర ప్ర‌మాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

హైద‌రాబాద్ లోని పెట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు చ‌నిపోయారు. వీరంతా ఒకే ఫ్యామిలీకి చెందిన వారు అని తెలుస్తోంది. దూల‌ప‌ల్లి ఫార‌స్టె స‌మీపంలో ఈ యాక్సిడెంట్ జ‌రిగినట్టు పోలీసులు తెలిపారు. చ‌నిపోయిన వారిలో భార్యాభ‌ర్త‌ల‌తోపాటు వారి కూతురు కూడా ఉంది.. ద్విచ‌క్ర‌వాహ‌నాన్ని మ‌రో వెహిక‌ల్ ఢీకొట్ట‌డంతోనే ఈ యాక్సిడెంట్ జ‌రిగిన‌ట్టు పోలీసులు తెలిపారు. యాక్సిడెంట్‌తో మృత‌దేహాలు రోడ్డుపై విసిరేసిన‌ట్టు ప‌డ్డాయి. ఆ రూట్‌లో వెళ్లేవాళ్లు ప్ర‌మాదాన్ని చూసి భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement