Friday, March 29, 2024

Breaking: వరంగల్ ఇన్నర్ రింగ్ రోడ్ భూ సమస్యకు పరిష్కారం..

కరీమాబాద్ (ప్రభ న్యూస్): వ‌రంగ‌ల్ నగరంలోని ఇన్నర్ రింగ్ రోడ్ భూ నిర్వాసితుల సమస్యకు పరిష్కారం చూపిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, తూర్పు ఎమ్మెల్యే నరేందర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. రెండేండ్లుగా పెండింగ్ లో ఉన్న ఈ సమస్యకు పరిష్కారం లభించింది.. ఇన్నర్ రింగ్ రోడ్ భూ నిర్వాసితుల నిరీక్షణ ఫలించింది.

ముఖ్యమంత్రి కేసీఆర్ కు, మంత్రి కేటీఆర్ సమస్యను వివరించి వారి ఆశీస్సులతో సమస్యను పరిష్కరించినందుకు వరంగల్ ఇన్నర్ రింగ్ రోడ్ 200 ఫీట్ల భూబాధితుల సమాఖ్య ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం.. వరంగల్ లోని రాజశ్రీ గార్డెన్ లో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ను స‌న్మానించి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement