Thursday, April 25, 2024

Breaking: క‌రీంన‌గ‌ర్‌లో 3 నామినేషన్ల తిరస్కరణ.. బరిలో 24 మంది అభ్యర్థులు

కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా దాఖలు చేసిన మూడు నామినేషన్లను జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి కర్ణన్ తిరస్కరించారు. బుధవారం నామినేషన్ల పరిశీలనలో భాగంగా విక్రమ్ రెడ్డికి చెందిన నామినేష‌న్‌లో తక్కువ వయసు ఉండడంతో తిరస్కరించారు.

శ్రీకాంత్, రాజు నామినేషన్లపై తాము సంతకాలు చేయలేదని ప్రపోజల్స్ గా ఉన్న వ్యక్తులు వాంగ్మూలం ఇవ్వడంతోపాటు నామినేషన్ పత్రాలపై సంతకాలు ట్యాలీ కాకపోవడంతో ఇద్దరి నామినేషన్లను తిరస్కరించామని తెలిపారు. నామినేషన్ల తిరస్కరణ అనంతరం కరీంనగర్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు గానూ 24 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు క‌లెక్ట‌ర్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement