Wednesday, March 27, 2024

Breaking: రంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నిక లేనట్టే.. టీఆర్ ఎస్ అభ్య‌ర్థుల‌ ఏక‌గ్రీవం లాంఛ‌న‌మే..

Rangareddy: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో లోకల్ బాడీ ఎమ్మెల్సీలు ఎకగ్రీవ మయ్యారు. ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసిన చంద్రశేఖర్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. నామినేషన్ పత్రాలు సరిగా పూర్తి చేయక పోవడం…ప్రతిపాదించే వాళ్లు లేకపోవడంతో నామినేషన్ తిరస్కరణకు గురైంది.

దీంతో టీఆర్ ఎస్ పార్టీకి చెందిన పట్నం మహేందర్ రెడ్డి…శంభీపూర్ రాజు ఏకగ్రీవంగా ఎన్నిక‌యిన‌ట్టు తెలుస్తోంది. ఇది ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కాగా, ఈనెల 26న నామినేషన్ల ఉపసంహరణ రోజు దీన్ని అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం కావడంతో ఒటర్లలో అసంతృప్తి నెలకొంది. ఎన్నికలు జరిగితే వారికి డబ్బులు వచ్చేవని, దాంతోపాటు విహార యాత్రకు కూడా వేళ్లే చాన్స్ లేకుండా పోయింద‌ని చాలామంది ప్ర‌జాప్ర‌తినిధులు లోలోన మ‌ధ‌న ప‌డుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌,  ట్విట్టర్   పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement