Thursday, March 28, 2024

Breaking: ఎమ్మెల్యే కోటా టీఆర్ఎస్ ఎమ్మెల్సీల ఎన్నిక‌ ఏక‌గ్రీవం

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో నామినేష‌న్లు దాఖ‌లు చేసిన‌ ఆరుగురు టీఆర్ఎస్ అభ్య‌ర్థులు ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, క‌డియం శ్రీహ‌రి, బండా ప్ర‌కాశ్‌, త‌క్కెళ్ల‌ప‌ల్లి ర‌వీంద‌ర్ రావు, పాడి కౌశిక్ రెడ్డి, వెంక‌ట్రామిరెడ్డి ఎన్నిక ఏక‌గ్రీవం అయిన‌ట్టు ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారి వెల్ల‌డించారు.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఆరుగురు అభ్య‌ర్థుల‌కు ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారి ధ్రువీక‌ర‌ణ ప‌త్రాల‌ను సోమ‌వారం అంద‌జేశారు. ఈ నెల 16న టీఆ‌ర్‌‌ఎస్‌ అభ్య‌ర్థులు గుత్తా సుఖేం‌ద‌ర్‌‌రెడ్డి, కడియం శ్రీహరి, బండా ప్రకాశ్‌, పాడి కౌశి‌క్‌‌రెడ్డి, వెంక‌ట్రా‌మి‌రెడ్డి, తక్కె‌ళ్ల‌పల్లి రవీం‌ద‌ర్‌‌రావు నామి‌నే‌షన్లు దాఖలు చేసిన సంగ‌తి తెలిసిందే. అదే రోజు దాఖ‌లు చే‌సిన మరో ఇద్దరు స్వతంత్ర అభ్య‌ర్థుల నామి‌నే‌ష‌న్లను ఎన్ని‌కల రిట‌ర్నింగ్‌ అధి‌కారి తిర‌స్క‌రిం‌చారు. దీంతో టీఆ‌ర్‌‌ఎస్‌ అభ్య‌ర్థుల ఎన్నిక ఏక‌గ్రీ‌వ‌మైంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement