Tuesday, March 26, 2024

Breaking: గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌లో ఘోరం.. క‌త్తుల‌తో ప‌ర‌స్ప‌రం దాడి..

వ‌రంగ‌ల్ జిల్లాలోని నెక్కొండ రైల్వే స్టేష‌న్ ప‌రిధిలో ఇవ్వాల దారుణం జ‌రిగింది. ఈ రైల్వే స్టేష‌న్ నుంచి గోల్కొండ ఎక్స్‌ప్రెస్ క‌ద‌ల‌గానే ఇద్ద‌రు వ్య‌క్తులు క‌త్తుల‌తో ప‌ర‌స్ప‌రం దాడి చేసుకున్నారు. దీంతో నెక్కొండ – వ‌రంగ‌ల్ మ‌ధ్య ఉన్న ఎలుగూరు రైల్వేస్టేష‌న్ వ‌ద్ద కొంత‌మంది చైన్ లాగ‌డంతో ట్రైన్ ఆగిపోయింది. అనంత‌రం దాడికి పాల్ప‌డ్డ ఇద్ద‌రూ రైలు దిగి పారిపోయారు. కాగా, వారిద్ద‌రిని యాచ‌కులుగా రైల్వే పోలీసులు అనుమానిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement