Saturday, April 20, 2024

పండగ వేళ అపశృతి.. కైట్ కోసం వెళ్తే బాలుడికి కరెంట్ షాక్

సంక్రాంతి పండగ వేళ అపశృతి చోటు చేసుకుంది. గాలిపటం కోసం విద్యుత్‌ స్తంభం ఎక్కిన ఓ బాలుడికి తీవ్రగాయాల పాలైయ్యాడు. ఈ ఘటన ములుగులో చోటుచేసుకుంది. గాలిపటం ఎగరేస్తుండగా..  పతంగి విద్యుత్ సంభంకు చిక్కుకుపోయింది. దీంతో గాలిపటం కోసం బాలుడు విద్యుత్‌ స్తంభం ఎక్కాడు. గాలిపటం తీస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. సమాచారం అందిన వెంటనే కరెంటు సరఫరా నిలిపేసిన లైన్‌మెన్‌.. బాలుడిని కిందికి దింపారు. అపస్మారకస్థితిలో ఉన్న బాలుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్ల తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement