Saturday, April 20, 2024

BJP, TRSలు డబుల్ గేమ్ ఆడుతున్నాయ్: చాడా వెంకటరెడ్డి

తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్‌ పార్టీలు డబుల్ గేమ్ ఆడుతున్నాయని విమర్శించారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి. బీజేపీతో కేసీఆర్.. గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ చేస్తున్నారన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న వారికి కేసీఆర్ ప్రభుత్వం పెన్షన్ ఇవ్వాలని చాడా వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఎంఐఎంతో దోస్తీ కారణంగానే కేసీఆర్ సెప్టెంబరు 17ను అధికారికంగా నిర్వహించటం లేదన్నారు. తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవానికి బీజేపీ మతం రంగు పులుముతోందన్నారు. . తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవాన్ని కేంద్రం గుర్తించిన తర్వాతనే అమిత్ షా తెలంగాణలో పర్యటించాలన్నారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా దగా యాత్ర చేస్తున్నాడని‌ ధ్వజమెత్తారు. బండి పాదయాత్రలో పస లేదని… ఆయనను అసలు ప్రజలు గుర్తించటం‌ లేదని చాడా విమర్శించారు. ఇక తెలంగాణ సీపీఐ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 11 నుంచి 17 వరకూ సాయుధ అమరులకు నివాళి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చాడా వెంకటరెడ్డి పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: శ్రీవారి సర్వ దర్శనాలు పున: ప్రారంభం..

Advertisement

తాజా వార్తలు

Advertisement