Thursday, April 25, 2024

బీజేపీది రౌడీయిజం, మాది కేసీఆరిజం.. ఇక దేశం కోసం టీఆర్ ఎస్ పోరు: ఎమ్మెల్యే జీవన్​రెడ్డి

నిజామాబాద్ సిటీ, (ప్ర‌భ న్యూస్‌) : దేశంలో బీజేపీది రౌడీయిజం. తెలంగాణ రాష్ట్రంలో మాది కేసీఆరిజం. బీజేపీ రౌడీయిజం నిలువునా ముంచడం.. అంబానీ, ఆదానీల ఆస్తులు పెంచడం. కేసీఆరిజం అంటే రాష్ట్ర సంపద పెంచడమని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. గురువారం నిజామాబాద్‌ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ రైతు వంచక పార్టీ అని, మోడీది జనకంఠక పాలన అని ఎద్దేవా చేశారు. కేంద్ర పాలకులు రైతులను హింసిస్తున్నారన్నారు.. ఒకప్పుడు అన్నమో రామచంద్రా అంటూ వలసలు పోయిన ఘోరమైన చరిత్ర తెలంగాణది. ఇప్పుడు కేసీఆర్ ముందు చూపు పాలనతో దేశానికే అన్నం పెడుతున్నద‌న్నారు. అలాంటి తెలంగాణపై మోడీ ప్రభుత్వం కక్షగట్టి కనికరం లేకుండా రైతులను వేధిస్తున్నార‌ని విమ‌ర్శించారు. వడ్ల కొనుగోలులో రైతులకు తీరని ద్రోహం చేస్తున్నార‌ని మండిపడ్డారు.

బండి కాదు తొండి సంజయ్. ఫేక్, ఫాల్స్, ఫ్రాడ్ ఎంపీ అరగుండు అరవింద్. వీరికి కేసీఆర్ ను అనే స్థాయి ఉందా. నిన్న ఈ ఇద్దరూ సభ్యత , సంస్కారం లేకుండా సీఎం కేసీఆర్ పై ఇష్టం వచ్చినట్టు వాగారనీ ఎమ్మెల్యే జీవ‌న్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వడ్లు కొంటారో, లేదో చెప్పమంటే అది చెప్పరు. ఢిల్లీ పోయి రైతుల తరపున మాట్లాడరు. నోరు తెరిస్తే సొల్లు పురాణం చెబుతారని విమ‌ర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement