Friday, April 19, 2024

టీఆర్ఎస్ తెలంగాణను భ్రష్టు పట్టిస్తోంది: మురళీధర్ రావు

టీఆర్ఎస్ ప్రభుత్వం పై ఘాట్ వ్యాఖ్యలతో విమర్శించారు బీజేపీ నేత మురళీధరరావు. తెలంగాణను టీఆర్ఎస్ భ్రష్టు పట్టిస్తోందని విమర్శించారు. ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణలో… ఉద్యమాలపై లాఠీ దెబ్బలు పెరిగాయని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థ దెబ్బతిన్నదని చెప్పారు.యువతకు ఉద్యోగావకాశాలు దెబ్బతిన్నాయని.. ఓయూలాంటి యూనివర్శిటీల్లో కూడా 80 శాతం ఫ్యాకల్టీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని మురళీధర్ రావు విమర్శించారు. ప్రభుత్వం సరైన దారిలో వెళ్లడం లేదని… రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిందేనని చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ సహకారం ఉందని… అదే విధంగా రాష్ట్ర అభివృద్ధిలో కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం ఉందని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా టైమ్ కి రావడం లేదని చెప్పారు. డబుల్ బెడ్రూమ్ ల విషయంలో కూడా ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని… 2019 నాటికి 2.70 వేల ఇళ్ల నిర్మాణం పూర్తి కావాలని… కానీ ఇప్పటి వరకు 30 వేలు మాత్రమే పూర్తయ్యాయని ఎద్దేవా చేశారు.కేసీఆర్ పాలనలో దళితులు పూర్తిగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తాలిబన్ మద్దతుదారులు, రాజకీయ నాయకులు ఉన్నారని… టీఆర్ఎస్ పార్టీతో కలిసి వారు రాజకీయాలు చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఇది కూడా చదవండి: లండన్ రెస్టారెంట్‌లో విరుష్క లంచ్..

Advertisement

తాజా వార్తలు

Advertisement